Chandra Babu in Kuppam | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది. కుప్పం అసెంబ్లీ స్థానానికి ఏపీలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో శుక్రవారం ఆయన కుప్పంలో పర్యటించారు.
కుప్పం బస్టాండ్ వద్ద జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా, ఓ ఆగంతకుడు సభా వేదిక వద్దకు రావడం కలకలం రేపింది. అతడ్ని పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు.. బాంబు ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు సదరు ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తెరిచి రక్షణగా నిలిచారు.