తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి, ఇతర ఉపాలయాలకు 2022-23 సంవత్సరానికి గాను అరటిపండ్లు, తమలపాకులు, టెంకాయలు, నిమ్మకాయలు తదితర పూజా సామగ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు టెండరు షెడ్యూల్ పొందవచ్చని వివరించారు.
ఆలయ డిప్యూటీ ఈవో కార్యాలయంలో జులై 20వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు స్వీకరిస్తారని చెప్పారు. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లు తెరుస్తారని, ఇతర వివరాలకు డిప్యూటీ ఈవో కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.