అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఉద్యోగులు చేపట్టబోయే పోరాటాలకు టీడీపీ మద్దతు ఇస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సోమవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేతలతో ఆయన సమావేశమై వరదల నివారణ, బాధితులకు సహాయం తదితర వాటిపై చర్చించారు. విపత్తు నిధులు రూ.1,100 కోట్లను జగన్ ప్రభుత్వం దారిమళ్లించారని ఆరోపించారు. బాధితులకు ఇంతవరకు నష్ట పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ వ్యాఖ్యానించడంపై ఆయన చేతగానితనానికి నిదర్శనమని వెల్లడించారు. ఓటీఎస్ పేరుతో రూ.14,261 కోట్ల వసూళ్లు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.