అమరావతి : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్మూకే మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయానికే తొలి నుంచి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు ఆతరువాత కాంగ్రెస్కు దగ్గరై బీజేపీకి దూరమయ్యారు.
2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోరంగా ఓటమి పాలవడంతో అప్పటి నుంచి కేంద్రంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఈ దశలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తుండడంతో టీడీపీకి ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్డీయే అభ్యర్థి ముర్ముకే మద్దతును తెలియచేస్తున్నట్లు ప్రకటించడం ప్రాదాన్యత సంతరించుకుంది.
మరోవైపు 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కేంద్రానికి అండగా ఉంటుంది. ప్రసుత్తం వైసీపీకి 23 ఎంపీలు, 150 మంది ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులున్నారు.