అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక , శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి టీడీపీకి కొత్త నిర్వచనం చెప్పారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో అమరావతి రాజధాని, అధికార వికేంద్రీకరణ అంశంపై స్వల్పకాలిక చర్చలో మంత్రి ప్రసంగించారు. అమరావతి కొంతమంది టీడీపీ నాయకుల స్వార్థం కోసం వెలసిన రాజధాని అని వ్యాఖ్యనించారు.
రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల వద్ద నుంచి భూములు కొనుగులో చేశారని, మొత్తం 30 వేల ఎకరాలకు గాన 10 వేల ఎకరాలు టీడీపీ వారివేనని ఆరోపించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పేర్కొ న్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అధికార వికేంద్రీకరణ జరగాలని స్వయాన శివరామకృష్ణన్ ఇచ్చిన నివే దికలో పేర్కొన్నారని తెలిపారు. అధికార వికేంద్రీకరణ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదని అన్ని ప్రాంతా లు విస్తరించాలనే సూచనలతో ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు అంటుందని వెల్లడించారు.