అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే సభకు అంతరాయం కలిగిస్తుండటంతో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సితారాం సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతుండటంతో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను (TDP MLAs) ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయినవారిలో రామ్మోహన్రావు, సాంబశివరావు, సత్యప్రసాద్, చినరాజప్ప, అశోక్, అచ్చెన్నాయుడు, భవానీ, రామకృష్ణబాబు, వెంకటనాయుడు, రవికుమార్, జోగేశ్వరావు ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతివిషయాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు.