Payyavula Keshav | వేతనాలు పెంచడంతోపాటు ఇతర డిమాండ్లను సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు చేపట్టిన ధర్మపోరాటానికి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వేతనాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, డీఏ బకాయిల విడుదలపై కనీసం ప్రస్తావించడం లేదని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీపై స్పష్టత కోసం ఉద్యోగ సంఘం నేతలను సచివాలయంలో రోజంతా నిలబెట్టారని ఆరోపించారు.
కరోనా వేళ విధులు నిర్వర్తిస్తూ.. ఆ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఏ పరిహారం ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం వైఎస్ జగన్ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము కూడా దారి మళ్లించడం సిగ్గుచేటని అభిప్రాయ పడ్డారు. పీఆర్సీ నివేదిక బయటపెట్టకుండా ఉద్యోగులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు. 50 శాతం ఫిట్మెంట్ పీఆర్సీ అమలు చేయాలన్న ఉద్యోగుల డిమాండ్ను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.