అమరావతి: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడికి సానుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అకారణంగా పోలీసులు తనకు నోటీసులు జారీ చేసి అరెస్టు చేయాలని చేస్తుందని పేర్కొంటు అయ్యన్నపాత్రుడు ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషన్పై విచారించిన అయ్యన్నపాత్రుడుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో అయ్యన్నపాత్రుడికి ఊరట లభించినట్లయ్యింది.
విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ నాయకుడు రామకృష్ణ అయ్యన్నపాత్రుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిన్నటి నుంచి ఈరోజు వరకు అయ్యన్నపాత్రుడి ఇంటికి నోటీసులు అతికించారు. అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పోలీసులకు వివరించినా పోలీసులు నమ్మలేదు. రాత్రి కూడా అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లిన పోలీసులు ఈరోజు వరకు అక్కడే ఉండిపోయారు.