అమరావతి : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని నిందితుల అరెస్టు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనలో 8 మందిని అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. నిన్న ఉదయం చంద్రయ్యను కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేశారని తెలిపారు.
చంద్రయ్య కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. హత్య జరిగిన పిమ్మట నాలుగు బృందాలను ఏర్పాటుచేసి నిందితులను పట్టుకున్నామని వివరించారు. ప్రధాన నిందితుడు ప్రసుత్తం వెల్దుర్తి ఎంపీపీగా ఉన్న చింతా శివరామయ్య, టీడీపీ నేత చంద్రయ్యల మధ్య పాత సిమెంట్ రోడ్డు నిర్మాణంలో గొడవలు జరిగాయని వివరించారు.