Chandrababu | ఏపీ సీఎం జగన్ కేసుల విచారణకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని టీడీపీ నేత ఆలపాటి రాజా సవాలు విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి దోచుకుంటూ.. దాచుకుంటూ.. ప్రతిపక్ష నేత మీద అక్రమ కేసులు బనాయించారని అన్నారు. చంద్రబాబు మీద పెట్టిన కేసుల్లో ఏ ఒక్కదాంట్లోనూ ఆధారాల్లేవని కోర్టులే స్పష్టం చేశాయని అన్నారు. న్యాయ శాస్త్రంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని చంద్రబాబుపై కేసులు పెట్టారని అన్నారు. న్యాయ శాస్త్రంలోని లోపాలను అడ్డం పెట్టుకుని వైసీపీ చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదో అవినీతి జరిగిందని వేసిన కేసు చూసి న్యాయ నిపుణులే ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగం గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసులు పెట్టాలంటే.. చంద్రుడి మీద బురదవేసినట్లేనని అన్నారు.
సీఎం జగన్ దోచుకుంటూ.. దాచుకుంటున్నారని ఆలపాటి రాజా విమర్శించారు. ఓ పక్క దోపిడీ చేస్తూనే చంద్రబాబుపై కేసులు వేస్తున్నారని ఆరోపించారు. బాబాయ్ హత్య కేసులో అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ వెళ్తే అడ్డుకోలేదా అని జగన్ను ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేశాడని నిరూపించడం సీఎం జగన్ నాయన వల్లే కాలేదని.. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన జగన్ వల్ల ఏమవుతుందని ఎద్దేవా చేశారు. పెద్ద ఎత్తున కేసులున్నా.. కోర్టులకు వెళ్లకుండా జగన్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తనపై ఉన్న కేసుల విచారణకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. అక్రమ కేసులు బనాయిస్తే దొర దొంగవడు.. దొంగ దొరవడని వ్యాఖ్యానించారు. తనపై ఉన్న కేసు