అమరావతి : విజయవాడ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని (Keshineni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగనున్న ఎన్నికల అనంతరం టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీలో విలీనం ఖాయమని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన అవసరాలకు కోసం రాజకీయ ఎత్తుగడల (Political Stratagey) ను మార్చే చంద్రబాబు (Chandra Babu) ఉసరవెల్లి లాంటి వ్యక్తి అని విమర్శించారు.
ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని బీజేపీ పెద్దలకు చంద్రబాబు తాకట్టు పెట్టాడని ఆయన దుయ్యబట్టారు. ఏపీలో జగన్ను గద్దె దించేందుకు చంద్రబాబు, పవన్కల్యాణ్ మోదీ భజన చేస్తున్నారని పేర్కొన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్కల్యాణ్ ఈ ఎన్నికల్లోనూ ఓడిపోవడం ఖాయమని వెల్లడించారు. ఓటమి భయంతోనే వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల మోదీ పర్యటను సాఫీగా జరపడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు.