Chandrababu | అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా కొనసాగుతోంది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి, వైఎస్సార్సీపీ మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీల అధినేతలు కూడా మండుటెండలను లెక్క చేయకుండా రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ, జనాలను చైతన్యవంతం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా జనాల దృష్టిని ఆకర్షించేందుకు నేతలు పలు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టైలిష్ లుక్లో కనిపించారు. కూలింగ్ గ్లాసెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ దృశ్యం పామర్రు ప్రజాగళం సభలో ఆవిష్కృతమైంది. ఓ అభిమాని బహుమతిగా ఇచ్చిన కళ్లజోడును చంద్రబాబు ధరించి టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు.