Chandrababu | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తె లంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం లో టీడీపీ అధినేత చంద్రబాబుకు న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు. తనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. మరోవైపు చంద్రబాబు రిమాండ్ను మరో 2 రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు.. ఆ రెండు రోజులు ఆయనను సీఐడీ కస్టడీకి అప్పగించింది. చంద్రబాబు దాఖలుచేసిన బెయిల్ పిటిషన్పై విచారణ సైతం వాయిదాపడింది. ఇప్పటికే ఈ కేసులో 140 మంది సాక్షులను విచారించినందున.. సీఐడీ విచారణను అడ్డుకోవడం సమంజసం కాదని హైకోర్టు పేర్కొంది. విచారణ సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించింది.
రెండు రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు
విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబును విచారించేందుకు 2 రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఆయనను విచారించాలని ఆదేశించింది. న్యాయవాదుల సమక్షంలో విచారించాలని తెలిపింది. విచారణ ఫొటోలు, వీడియోలు విడుదల చేయరాదని స్పష్టంచేసింది. విచారణ నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. చంద్రబాబుకు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో మరో 2 రో జులు పొడిగించింది. ఇదే సమయంలో ఏసీ బీ కోర్టులో దాఖలైన బెయిల్ పిటిషన్ను సైతం ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. బెయిల్ పై సోమవారం విచారణ జరుపుతామని తెలిపింది. ఏసీబీ కోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వటం, క్వాష్ పిటిషన్ కొట్టివేయటంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన తరపు లాయర్లు నిర్ణయించారు.