అమరావతి : ఏపీ ఎమ్మెల్యేల (AP News) కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. గెలుపునకు అవసరమైన 23 ఓట్లు ఆమెకు లభించాయి. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంతో అనురాధను విజయం వరించిందని చెబుతున్నారు.
మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ మొత్తం ఏడు స్ధానాలకు అభ్యర్ధులను బరిలో దింపింది. 19 మంది సభ్యుల మద్దతు కలిగిన టీడీపీ సైతం తమ అభ్యర్ధిగా అనురాధను బరిలో నిలపడంతో ఉత్కంఠ నెలకొంది.
ఇక వైసీపీ తమ అభ్యర్ధులుగా జయమంగళ, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, సూర్యనారాయణ రాజు, పోతుల సునీత, యేసురత్నంలను ప్రకటించింది. ఇక వైసీపీ నుంచి ఏడో అభ్యర్ధికి పరాజయం ఎదురవనుండటంతో ఏ అభ్యర్ధికి తక్కువ ఓట్లు పోలవుతాయనే చర్చ జోరందుకుంది. తుది ఫలితాలు వెల్లడికాగానే ఈ అంశంపై స్పష్టత రానుంది.
Read More :
ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడి కన్నుమూత