అమరావతి : టీడీపీ ఏపీ అధ్యక్షుడు , మాజీ మంత్రి అచ్చెన్నాయుడు(Achchennaidu) మాతృమూర్తి (Mother) కళావతమ్మ టెక్కలిలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandra babu) , జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్, పార్టీ నాయకులు సంతాపం తెలియజేశారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.