అమరావతి : ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ(TDP Candidates) అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్(Rajashekar) , కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటిరాజేంద్రప్రసాద్(Rajendra Prasad) పేర్లను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.