అమరావతి : పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు.వైసీపీ వర్గీయులు దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జల్లయ్య అనే టీడీపీ కార్యకర్త చికిత్సపొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. దుర్గి మండలం జంగమహేశ్వరపురానికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలు బ్యాంక్ పనిపై దుర్గికి వాహనంపై బయలు దేరారు. గమనించిన వైసీపీ ప్రత్యర్థులు వారిపై వేటకొడవళ్లతో దాడి చేసి గాయపరిచారు.
వీరిలో జల్లయ్య నరసారావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.