తిరుమల: డాలర్ శేషాద్రి హఠాన్మరణం హృదయాన్ని కలచివేసిందని విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. నిత్యం వేంకటేశ్వర స్వామి పాదాల చెంత జీవించిన అదృష్టం ఆయనదని చెప్పారు. వేంకటేశ్వర స్వామిని దర్శించిన ప్రతి ఒక్కరికీ డాలర్ శేషాద్రి సుపరిచితులు అని పేర్కొన్నారు. డాలర్ శేషాద్రి ఆప్యాయతను పొందిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని చెప్పారు. డాలర్ శేషాద్రితో విశాఖ శ్రీ శారదా పీఠానికి సుధీర్ఘ కాలం అనుబంధం ఉందన్నారు. ఆయన సాక్షాత్తు మహావిష్ణువు హృదయంలోకి చేరాలని ఆశిస్తున్నామని ఆకాంక్షించారు.