అమరావతి: నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ & హెల్త్కేర్ ప్రొవైడర్స్(ఎన్ఏబీహెచ్) హాస్పిటల్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్ కింద శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)కు గుర్తింపు లభించింది. ఈ అక్రిడిటేషన్ ఎన్ఏబీహెచ్ నీమందనలకు లోబడి జనవరి 6, 2022 నుంచి జనవరి 6, 2025 వరకు మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఎన్ఏబీహెచ్ సీఈఓ డాక్టర్ అతుల్ మోహన్ కొచ్చర్ ఈ సమాచారాన్నిఇ-మెయిల్ ద్వారా స్విమ్స్ కు అందించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ పొందిన మొదటి ఆసుపత్రిగా సిమ్స్ నిలవడం విశేషం. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి. వెంగమ్మ మాట్లాడుతూ..అక్రిడిటేషన్ రావడంపట్ల సంతోషంగా ఉందన్నారు. నాణ్యత కలిగిన వైద్యసేవలు అందించడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు.