(Srikalahasti Suitcase) చిత్తూరు: సంక్రాంతి పండగ నేపథ్యంలో బస్లాండ్లు, రైల్వే స్టేషన్లు ఊళ్లకు తరలివెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అసలే టికెట్ రేట్లు పెంచడంతో కోపం మీద ఉన్న ప్రజలు.. బస్సులు సమయానికి అందకపోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంతూళ్లకు చేరుకునేందుకు ఏ వాహనం దొరికినా వదిలిపెట్టడం లేదు. ఒకపైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం, మరోవైపు ప్రభుత్వ కఠిన ఆంక్షల మధ్య ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఇదే సందర్భంలో ప్రజలను టార్గెట్ చేస్తూ అసాంఘిక సంస్థలు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా, శ్రీకాళహస్తి బస్టాండ్లో సూట్కేసు కలకలం సృష్టించింది. పదో నంబర్ ప్లాట్ ఫాం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సూట్కేస్ వదిలి వెళ్లారు. సూట్కేసు అనుమానాస్పదంగా కనిపించడం.. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్.. బస్లాండ్లోని ప్రయాణికులను బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద సూట్కేస్ను బ్రేక్ చేసిన బాంబ్ స్క్వాడ్.. అందులో ఏమీ లేదని తేల్చారు. దాంతో పోలీసులు, అధికారులు, ప్రయాణికులు, ఊపిరి పీల్చుకున్నారు. ఆ సూట్కేస్ ఎవరిదీ అని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అనుమానాస్పద వస్తువులు ఏవైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నారు. అపరిచితులు ఇచ్చే వస్తువులు తిని దోపిడీకి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..