Enforcement Directorate: 2021లో ముంద్రా పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని పలు ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: 2021లో ముంద్రా పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసుతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని పలు ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. దేశ రాజధానిలోని కనీసం అయిదు చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ వ్యాపారవేత్త హర్పీత్ సింగ్ తల్వార్ అలియా్ కబీర్ తల్వార్తో పాటు మరికొంత మందిపై పీఎంఎల్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేపడుతున్నది. ఢిల్లీలో ఉన్న పాపులర్ నైట్క్లబ్లను తల్వార్ నడిపేవాడు. ఆగస్టు 2022లో డ్రగ్స్ కేసులో అతన్ని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇటీవలే అతను జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. గుజరాత్ హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. 2021 సెప్టెంబర్లో ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో కచ్ జిల్లాలో ఉన్న ముంద్రా పోర్టులో సుమారు 3వేల కిలోల ఆఫ్ఘన్ హెరాయిన్ను పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనతో లింకున్న కేసులో ఈడీ దర్యాప్తు చేపడుతున్నది.