అమరావతి : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం (EVM) ధ్వంసం ఘటనలో పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారులను సస్పెన్షన్ (Suspension) చేస్తూ సీఈవో ముఖేష్కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena) వెల్లడించారు. పీవోతో పాటు ఏపీవోలోను సస్పెన్షన్కు ఆదేశాలు జారీ చేసినట్లు గురువారం వివరించారు.
వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinneli Ramakrishna reddy) అరెస్టుకు అదనపు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసుల బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. మాచర్లలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బాధితుల పరామర్షలు సరికాదని స్పష్టం చేశారు. ఈ సమయంలో పరామర్శలు చేయవద్దని రాజకీయ నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈవీఎం ధ్వంసం దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని తెలిపారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుంచో దృశ్యాలు బయటకెళ్లాయని వివరించారు. ఈనెల 25 నుంచి స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనకు రాష్ట్రంలో పర్యటిస్తానని పేర్కొన్నారు.