అమరావతి : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు హనుమంతును సస్పెన్షన్ చేస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమ జంట కు సహకరించిన యువకులను హోంగార్డు స్పృహ కోల్పోయ్యేలా హోంగార్డు చితకబాదాడు. దీంతో నాగరాజు అనే యువకుడు తీవ్రంగా గాయపడడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై ఆందో ళనలు జరగడంతో హోంగార్డుపై విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారుల నివేదిక మేరకు ఎస్పీ సస్పెన్షన్ చేశారు.