అమరావతి : ఏపీ స్కిల్ స్కాం కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వం తరుఫున ఈ కేసు తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఎవరూ కూడా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. ఇరువురు సంయమనం పాటించాలని సూచించింది.
స్కిల్ స్కాం (Skill Scam Case) కేసులో చంద్రబాబు(Chandra Babu) అరెస్టు అనంతరం హైకోర్టు బెయిల్(High Court Bail) ఇచ్చిన దరిమిలా ఆయన బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ(AP CID) వేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీం కోర్టు(Supreme Court) లో విచారణకు వచ్చింది . బెయిల్ రద్దుపై వెంటనే విచారణ చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది. సీఐడీ పిటిషన్పై డిసెంబర్ 8కి విచారణను వాయిదా వేసింది.
ఈ విషయంలో డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే విచారణ చేస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అపట్టివరకు చంద్రబాబును రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలన్న ప్రభుత్వం విజ్ఞప్తిని కోర్టు నిరాకరించింది.