శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ వి.సుబ్రహ్మన్యన్ తన సతీమణి సరస్వతితో కలిసి దర్శించుకున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి జస్టిస్ డాక్టర్ బి. శివశంకర్రావు కూడా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న వీరికి ఈవో లవన్న ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి గర్భాలయంలో బిల్వాభిషేకాలు, వృద్ధమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు, అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చక వేదపండితులు వేదాశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు జడ్జిల కుటుంబాలకు అందించారు.