శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ – అమిత దంపతులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల మహామంగళ హారతి దర్శనాలు చేసుకుని మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన, అమ్మవారి యాగశాలో చండీహోమం, ఆలయంలో శ్రీచక్ర కుంకుమార్చన చేసుకుని హారతులు అందుకున్నారు. అనంతరం జస్టిస్ దంపతులకు అమ్మవారి ఆలయ
మండపంలో వేదపండితులు ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలను అందజేశారు.