Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా దంపతులు దర్శించుకున్నారు.
శనివారం గంగాధర మండపం నుంచి ఆలయ ప్రవేశం చేసిన గవర్నర్ దంపతులకు శ్రీకృష్ట దేవరాయ గోపురం వద్ద ఈవో పెద్దిరాజు, చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో అర్చక వేదపండితులచే తిలక ధారణ చేసి స్వాగతం పలుకారు. ఈ సందర్భంగా స్వామివారి గర్బాలయంలో అభిషేకం, బిల్వార్చన చేసుకుని అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన హారతులు అందుకున్నారు. అనంతరం ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు వల్లించిన ప్రధానార్చకులు అభిషేక జల తీర్థప్రసాదాలు ఇచ్చారు.