అమరావతి : భారీ వర్షాలతో అతలాకుతమైన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతపురం నెల్లూరు, చిత్తూరు, కడప ఇతర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను త్వరితగతిన ఆదుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు త్వరితగతిన రూ. 2 వేల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చిత్తూరు, తిరుమలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం ఆరా తీశారు.