శ్రీబాలాజీ జిల్లా: తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో సుధీంద్ర తీర్థ ఆరాధన నిర్వహిచారు. తమిళనాడులోని కుంభకోణంలో ద్వైత తత్వవేత్త శ్రీ సుధీంద్ర తీర్థ స్వామీజీ 400 వ ఆరాధన మహోత్సవం ఆదివారం జరిపారు. ఈ సందర్భంగా టీటీడీ తరఫున ఆలయం ఈఓ ఏవీ సుబ్బారెడ్డి హాజరై.. శ్రీవారి వస్త్రాలను సమర్పించారు.
మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర మఠానికి చెందిన శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ కూడా ఈ సందర్భంగా జరిగిన పంచమూర్తాభిషేకంలో పాల్గొన్నారు. చెన్నై ఎల్ఏసీ చీఫ్ శేఖర్ రెడ్డి, పారుపట్టేదార్ తులసి తదితరులు ఈ సుధీంద్ర తీర్థ ఆరాధాన ఉత్సవాల్లో పాల్గొన్నారు.