అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ అమలుపై ఏపీ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఐఆర్ అడ్జస్ట్మెంట్ చేస్తామన్న ప్రభుత్వ ఆదేశాలపై కోర్టు స్పందించింది. జీతాల్లో రికవరీ అనేది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
ఈనెల 3న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో చలో విజయవాడ నిర్వహిస్తున్నందున కరోనా పరిస్థితుల్లో చలో విజయవాడను నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని వేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. సమ్మెప్రజాస్వామ్య సూత్రాల్లో ఉన్న హక్కు అంటూ వ్యాఖ్యనించింది. తదుపరి విచార మూడు వారాలకు వాయిదా వేసింది .