అమరావతి : గోదావరి వరద, సహాయ కార్యక్రమాలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల్లో సహాయక బృందాలను వినియోగించుకోవాలని సూచించారు. మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని , సౌకర్యాల కల్పన, సేవలు నాణ్యంగా ఉండాలని స్పష్టం చేశారు.
వరద బాధిత కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయాలని , ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు లేదా వ్యక్తికి వెయ్యి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లిపోయేలోగా అందించాలని ఆదేశించారు. ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.