హైదరాబాద్,ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జూలై నెల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నది. టికెట్లు పొందిన వారు 20 నుంచి 22మధ్యా హ్నం 12గంటల్లోపు నగదు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని వివరించింది.
కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు 21న ఉదయం 10గంటల కు విడుదలవుతాయని తెలిపింది. వర్చువల్ సేవల దర్శనస్లాట్లను 21న మధ్యాహ్నం 3గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10గంటలకు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా 23న 11గంటలకు విడుదలవుతాయని పే ర్కొన్నది. ప్రత్యేక ప్రవేశదర్శన కోటాను 24న 10గంటలకు విడుదల చేస్తామని తెలిపింది.