శ్రీశైలం : శ్రీశైల మల్లికార్జునస్వామి అమ్మవార్ల హుండీలను శుక్రవారం ఉదయం లెక్కించారు.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ నిఘా మధ్య ఆలయ సిబ్బంది, భక్తులు, సేవాసంస్థల సభ్యుల సహకారంతో లెక్కింపు జరిగింది.
భక్తులు రూ. 1,82,52,416 నగదు, 67 గ్రాముల బంగారం, 4 కేజీలన్నర వెండి , 22 యూఎస్ఏ డాలర్స్తోపాటు విదేశీ కరెన్సీని కానుకలుగా సమర్పించినట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. 10 రోజులకుగాను ఈ ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి