అమరావతి : శ్రీశైలం జలాశయం 10 గేట్లను 12 అడుగుల మేర పైకెత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి 2,35,086 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుండగా 3,19,830 క్యూసెక్కుల నీటిని స్పిల్వే ద్వారా దిగువకు విడు దల చేస్తున్నారు.
శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయం నుంచి 62,529 అదనపు క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 884.90 అడుగులుండగా 215.3263 టీఎంసీ నీరు జలాశయంలో నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.