అమరావతి : శ్రీశైలం భ్రమరాంభికా మల్లిఖార్జున ఆలయంలో ప్రసుత్తం ఉన్న దుకాణాలను కొత్త కాంప్లెక్స్లోకి మార్చడాన్ని వ్యాపారస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల నూతనంగా నిర్మించిన లలితాంబికా సముదాయంలోకి దుకాణాలను మార్చడం కోసం ఆలయ అధికారులు డిప్ పద్ధతిని ప్రవేశపెట్టారు.
ఈ పద్ధతిని నిరసిస్తూ సుమారు 175 దుకాణాలకు చెందిన యజమానులు తమతమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. అధికారులు అధిక అద్దెలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపించారు. దుకాణాల మూసివేతతో ఆలయ పరిసర ప్రాంతాలు బోసిపోయాయి.