Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాల్లో శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పోగొట్టుకున్న నగదు, సెల్ఫోన్లు నిజాయితీగా తెలంగాణ ఆటో డ్రైవర్ శ్రీశైల పోలీసులకు అప్పగించారు. ఇలా నిజాయితీగా వ్యవహరించిన తెలంగాణ ఆటో డ్రైవర్ శ్రీనును పోలీసు అధికారులు అభినందించారు.
కర్ణాటకలోని బీజాపూర్కు చెందిన భక్తులు రెండు రోజుల క్రితం శ్రీశైలం వచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని శనివారం AP39W6231 అనే నెంబర్ ఆటోలో ప్రయాణించి కొంత నగదు, సెల్ఫోన్ ఉన్న మనీపర్సును మరిచిపోయారు. ఇది గమనించి వారిని గుర్తించేందుకు ప్రయత్నించిన తెలంగాణ ఆటో డ్రైవర్ శ్రీనుకు వారి ఆచూకీ తెలియలేదు.
శ్రీశైల మండల పోలీస్ అధికారులను ఆశ్రయించి ఇన్స్పెక్టర్ దివాకర్రెడ్డి, ఎస్సై లక్ష్మణ్రావులకు మనీపర్సును ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, వెంకటశివుడు ఆధ్వర్యంలో అప్పగించారు. పొలీసులు విచారించి భాదితులకు మనీపర్సును అప్పగించారు. ఆటో డ్రైవర్ నిజాయితీకి వారు మెచ్చుకుని తగిన పారితోషికం అందించారు. పోలీస్ అధికారులు శ్రీనును శాలువా, పూలమాలతో సత్కరించారు. భక్తుల సేవలో ప్రతి ఆటో డ్రైవర్ తెలంగాణ శ్రీనును ఆదర్శంగా తీసుకుని నిజాయితీగా విధులు నిర్వహించాలని సీఐ దివాకర్రెడ్డి అన్నారు.