అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో (Srisailam Temple) ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో లెక్కింపు నిర్వహించగా రూ.5,96,92,376 కోట్లు ఆదాయం (Revenue) వచ్చిందని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఆదాయాన్ని గత 26 రోజులులో కానుకల రూపంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీలో వేశారని వివరించారు.
ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 232 . 400 మిల్లి గ్రాముల బంగారం(Gold) , 7 కేజీల 850 గ్రాములు వెండిని (Silver) భక్తులు కానుకగా వేశారని తెలిపారు. యూఎస్ఏ డాలర్లు ( Dollers) 558, సౌదీఅరేబియా రియాల్స్ 3, ఓమన్ బైసా 200, కువైట్ దినార్ 12, కత్తారు రియాల్స్ 4, సింగపూర్ డాలర్లు 7 వచ్చాయని తెలిపారు.
ఆస్ట్రేలియా డాలర్లు 60, కెనడా డాలర్లు 35, హాంకాంగ్ డాలర్లు 10, యూకే ఫౌండ్స్ 5, ఈరోస్ 115, కెన్యా షిల్లింగ్స్ 50, ఫిలిపిన్స్ పిసో 20, యూఏఈ దిర్హమ్స్ 15, జాంబియా క్వచ 20, జపాన్యన్స్ 1000 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయని వెల్లడించారు.