శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని అధికారులు మంగళవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు చేశారు. గత 27 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ. 3,28,23,979 (మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడువేల తొమ్మిది వందల డెభ్బై తొమ్మిది రూపాయలు) ఆదాయంగా వచ్చినట్లు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. వీటితోపాటు 455 గ్రాముల బంగారం, 7 కేజీల 230 గ్రాముల వెండి ఆభరణాలు, 314 యూఎస్ఏ డాలర్లు, 70 కెనడా డాలర్లు, 50 యూరోల విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులుగా సమర్పించినట్లు తెలిపారు.