Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి ఒకటో తేదీ నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు తదితరులు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే జవహార్ రెడ్డికి ఈఓ డీ పెద్దిరాజు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణకు ఈఓ డీ పెద్దిరాజు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కే జవహార్ రెడ్డికి, ఎస్ సత్యనారాయణలకు వేదాశీర్వచనంతోపాటు స్వామి వార్ల శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.