తిరుపతి : శ్రీనివాస సేతు పనులు త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం తిరుపతి మున్సిపల్ కమిషనర్ కుమారి అనుపమ అంజలితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీనివాస సేతు పనులు ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
మూడవ దశలో నిర్మాణంలో ఉన్న దాదాపు 60 మీటర్ల స్టీల్ గర్డర్ లను జనవరి 31వ తేదీకి నాటికి ఏర్పాటు చేయాలన్నారు. డెక్స్ ల్యాబ్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రామానుజ సర్కిల్, సుబ్బలక్ష్మి విగ్రహం , రేణిగుంట రోడ్డు , తిరుచానూరు రోడ్డు వైపు జరుగుతున్న పనుల గురించి చర్చించారు.
పాదాచారులు నడిచేందుకు అనువుగా పేవ్ మెంట్ , కాలువలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎఫ్ ఎ అండ్ సీ ఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, మున్సిపల్ ఎస్ఈ మోహన్, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జిఎం చంద్రమౌళి ,అధికారులు పాల్గొన్నారు.