తిరుపతి : శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే ఇవాళ తిరుపతికి రానున్నారు. ఉదయం 11.10 గంటలకు రాజపక్సే తిరుమల ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుమల శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకుంటారు. ఇవాళ రాత్రికి తిరుమలలోనే శ్రీలంక ప్రధాని బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 7:30 గంటలకు వీవీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం రేపు సాయంత్రం తిరిగి శ్రీలంకకు మహింద్ర రాజపక్సే వెళ్లనున్నారు. శ్రీలంక ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుపతితో పాటు తిరుమలలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.