తిరుపతి : సూర్యగ్రహణం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను మూసివేసిన పండితులు, అర్చకులు శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచారు. ఈ సందర్భంగా గ్రహణ కాల సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేయనున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు దోషం పోగొట్టుకోవడానికి రాహుకేతు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. హిందువుల విశ్వాసం ప్రకారం, సూర్యగ్రహణం రోజున ఆలయంలో ఉన్న శివుడిని, అమ్మవారిని పూజిస్తే వారి ‘జాతక’ దోషాలు తొలగిపోతాయని భక్తుల గట్టి నమ్మకం.
కాగా సూర్యగ్రహణం సందర్భంగా తిరుపతిలోని శ్రీవారి ఆలయం, కాణిపాక ఆలయం, నంద్యాలలోని శ్రీశైలం ఆలయం, విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని ఉదయం మూసివేశారు. తిరగి గ్రహణం పూర్తయిన పిదప రాత్రికి ఆలయాని సంప్రోక్షణ అనంతరం తెరవనున్నారు.