(Sharada Peetam) అమరావతి: విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సీఎం నివాసంలో కలుసుకున్నారు. వచ్చే నెలలో జరుగనున్న శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను జగన్కు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అందజేశారు. అనంతరం ఆయనను దుశ్శాలువతో సత్కరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామితో పాటు ముఖ్యమంత్రిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా కలిశారు. శ్రీ శారదా పీఠం వార్షిక మహోవ్సతవాలు వచ్చే నెల 7 నుంచి 11 వరకు జరుగనున్నాయి.