అమరావతి : తిరుమల శ్రీవారి ఆలయంలో రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకా ర భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగ మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగు తూ భక్తులకు దర్శనమిచ్చారు. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారని అర్చకులు తెలిపారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతు న్నాడని వివరించారు.
నిన్న శ్రీవారిని 64,079 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వివరించారు. 32,852 మంది తలనీలాలు సమర్పించుకున్నారని, భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ. 3.52 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.