అమరావతి : కర్నూలు జిల్లా ఆదోనిలోని జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి షాపు తాళా లు పగులగొట్టి విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించారు. కోట్ల రూపాయల విలువైన డైమండ్, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. తెలివిగా దొంగలు ఆదారా లు లభించకుండా దుకాణంలో కారం చల్లి చోరీకి పాల్పడ్డారు.
2.50 కిలోల బంగారం, 25 కిలోల వెండి చోరీ జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుకాణంలోని సీసీ కెమెరా లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.