విశాఖపట్నం: ఒడిశా పూరీలో జగన్నాథ రథయాత్ర సమయంలో ప్రత్యేక రైళ్లు నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక రైళ్ల వివరాలను సోమవారం వెల్లడించింది. విశాఖపట్నం-పూరీ స్పెషల్ (08933) జూలై 8న విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 1.15 గంటలకు పూరీ చేరుకుంటుంది. తిరిగి పూరీ-విశాఖపట్నం స్పెషల్ (08934) జూలై 9న రాత్రి 8.25 గంటలకు పూరీలో బయల్దేరి 10 వ తేదీన ఉదయం 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రైలు కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్చాపురం, బ్రహ్మపూర్, ఛత్రపూర్, ఖల్లికోట్, బాలుగావ్, హరిపూర్ గ్రామ్, మోటారి, కనాస్ రోడ్ పీహెచ్, డెలాంగ్, జెనాపూర్ రోడ్ పీహెచ్, బీర్ పురుషోత్తంపూర్, సఖిదేపూర్, సఖిదేగోపాల్, జానకీదీపూర్ పీహెచ్, మాలతీపట్పూర్లో ఆగుతుంది. గుణుపూర్-పూరీ స్పెషల్ (08941) గుణుపూర్లో జూలై 9న తెల్లవారుజామున 3.15 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 12.35 గంటలకు పూరీకి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో పూరీ-గుణుపూర్ (08942) రైలు జూలై 9న రాత్రి 8.40 గంటలకు పూరీలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు గుణుపూర్ చేరుతుంది. ఈ రైలు బన్సధార పీహెచ్, కాశీనగర్, పర్లాకిమిడి, పాతపట్నం, టెక్కలి, నౌపడ, పూండి, పలాస, మందస రోడ్డు, సోంపేట, ఇచ్చాపురం, సుర్ల రోడ్డు, గోలంత్ర, బ్రహ్మాపూర్, జగన్నాథ్పూర్, ఛత్రాపూర్, గంజాం, హమ్మా, రంభ, ఖల్లికోట్, చిలికా స్టేషన్లలో ఆగుతుంది. బాలుగావ్, గంగాధర్పూర్, కుహూరి, కలుపరఘాట్, భుసంద్పూర్, నిరాకర్పూర్, తపాంగ్, కైపాడ రోడ్, హరిపూర్గ్రామ్, మోటారి, కనాస్ రోడ్ పీహెచ్, డెలాంగ్, జెనాపూర్ రోడ్ పీహెచ్, బీర్ పురుషోత్తంపూర్, సఖిగోపాల్, జానకిదీపూర్ పీహెచ్, మాలతీపట్పూర్ స్టేషన్ల ఆగుతుంది. అలాగే, విశాఖపట్నం-పూరీ స్పెషల్ (08975) జూలై 10వ తేదీ ఉదయం 6.30 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి అదే రోజు తెల్లవారుజామున 1.15 గంటలకు పూరీకి చేరుకుంటుంది. పూరీ-విశాఖపట్నం (08976) రైలు జూలై 11వ తేదీ తెల్లవారుజామున 1 గంటకు పూరీలో బయల్దేరి అదే రోజు ఉదయం 10.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.