శ్రీశైలం : కార్తీక పౌర్ణమి వేడుకలు శ్రీశైల క్షేత్రంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు నిత్యకైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని ఈవో కేఎస్ లవన్న తెలిపారు. గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయస్వామి వారికి సర్కారి సేవగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసంలో దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం వల్ల సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని ప్రధాన అర్చకుడు భద్రయ్య చెప్పారు.