తిరుమల : పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వచ్చే నెలలో విశిష్ట ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు. మార్చి 1న మహాశివరాత్రి ఉత్సవాలు, మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను, మార్చి 18న శ్రీ లక్ష్మీ జయంతి, శ్రీ తుంబురు తీర్థ ముక్కోటిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 29న శ్రీ అన్నమాచార్య వర్ధంతిని జరుపుతామని వివరించారు.
కాగా నిన్న శ్రీవారిని 68,095వేల మంది భక్తులు దర్శించుకోగా 29,050వేల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారన్నారు. నిన్న స్వామివారి హుండీకి రూ.3కోట్ల 94లక్షల ఆదాయం వచ్చిందని వివరించారు.