తిరుపతి : తిరుపతి (Tirupati) కోదండ రామాలయం (Kodandaramaswamy) లో జూన్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహణ ఉంటుందని తెలిపారు. జూన్ 6న అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకం, రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగుతుందని వివరించారు.
9న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణం(Sitaramula Kalyanam), సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపు, అనంతరం ఊంజల్సేవను నిర్వహిస్తున్నామని వివరించారు. జూన్ 22 న పౌర్ణమి సందర్భంగా ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకం , సాయంత్రం 5.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం చేపట్టనున్నట్లు వివరించారు.