తిరుమల : తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మార్చి నెలలో జరిగే విశేష ఉత్సవాలను(Special festivals) టీటీడీ అధికారులు వెల్లడించారు. మార్చి 3వ తేదీన పల్స్ పోలియో, 6వ తేదీ, 20వ తేదీన సర్వ ఏకాదశి, 8న మహా శివరాత్రి, మార్చి 20 నుంచి 24 వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవం, 25న తుంబూరు తీర్థ ముక్కోటి, లక్ష్మి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
మార్చి 1 నుంచి టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడలు
టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు(Annual sports) మార్చి 1వ నుంచి 18వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తున్నామని, టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడలు నిర్వహించనున్నామని తెలిపారు. టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో స్నేహలత క్రీడల నిర్వహణను పర్యవేక్షిస్తారని వివరించారు.